మన్యం టీవి, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని భీముని గూడెం గ్రామానికి చెందిన సిరికొండ రాఘవులు తండ్రి సర్వయ్య ,వంశలకుడి అజయ్ తండ్రి రాములు మరియు వారి బంధు మిత్రులు వివాహ నిచ్చితార్ధ నిమిత్తం ములుగు జిల్లా, మంగపేట మండలంలోని కమలాపురం ఒక మ్యాజిక్ మరియు బులెరోలో వెళ్తుండగా మల్లారం మూలమలుపు వద్ద TS04ED8820 నంబర్ గల టాటా మ్యాజిక్ 4 వీలర్ బ్రేక్ వేయడం వలన స్కిడ్ అయి రోడ్ ప్రక్కన ఉన్న మట్టి దిబ్బకు ముందు టైర్లు తగలడంతో వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రావుల శివ నర్సింహారావు తండ్రి లాలు తో పాటు ప్రయాణికులు రాఘవులు,అజయ్,నిర్మల,వాణి తదితరులు మొత్తం 8మంది ప్రాణాపాయం లేకుండా స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
Post A Comment: