కరోనా సమయంలో పినపాక నియోజకవర్గ ప్రజలకు,కరోనా బాధిత కుటుంబాలకు అండగా నిలిచా
➡️వేల క్వింటాల బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించా
➡️ పినపాక నియోజకవర్గ ప్రజలకు అండగా నేనుంటా
✍️విజన్ తో ముందు కు...నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి
➡️ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల నవంబర్ 8 (మన్యం మనుగడ) కరోనా సమయములో బాధితులకు ,నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. సోమవారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ. కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలతో పాటు గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కరోనా బాధిత కుటుంబాలకు వేల క్వింటాళ్ల బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి వారికి అండగా నిలిచా అన్నారు. నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు అండగా నిలుస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలకు రేగా విష్ణు ట్రస్టు ద్వారా సీఎం సహాయనిధి ద్వారా బాధిత కుటుంబాలకు లక్షల రూపాయలు అందించి వారికి తోడ్పాటు గా నిలిచఅన్నారు. ఆపద సమయంలో నేనున్నానని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన హామీ ఇచ్చారు
Post A Comment: