- శివ నామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
- తెల్లవారు జామునుండే భక్తులతో పోటెత్తిన దేవాలయాలు
మన్యం టీవీ మంగపేట.
హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వాదినాన్ని పురస్కరించుకొని కార్తీక శుక్రవారం తెల్లవారుజామునుండే పవిత్ర గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా మండల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, రాజుపేట లక్ష్మి నర్సాపురంలోని శ్రీ నాగులమ్మ ఆలయం లో భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి బోళా శంకరుడికి ప్రత్యేకంగా పాలాభిషేకం, రుద్రాభిషేకం జరిపించి తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్బంగా సాయంత్రం ఆలయాలలో ఆకాశ దీపాలంకరణ నిర్వహించారు.
Post A Comment: