మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బృహతి పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన భూమిని పరిశీలించారు.అనంతరం ఏటూరు నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ పనులను మరియు ఆకుల వారి ఘనపూర్ తాసిల్దార్ కార్యాలయం,పశువుల హాస్పిటల్ ఆవరణంలో మరియు బస్టాండ్ లో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించారు.ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తినీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవీందర్,ఎంపీడీవో అనురాధ,ఎంపిఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ వుచంద్రకాంత్,పిఆర్ ఏఈ బిక్షపతి,ఈసీ లు రామయ్య, సదానందం,పంచాయతీ కార్యదర్శి రఫీ,వీఆర్వో పాండయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: