మన్యం టీవీ మంగపేట.
మండలం లోని అడవిలో పులి సంచారం ఉన్నందున పరిసర రాజుపేట, దోమెడ, నిమ్మగూడెం, చింతకుంట, తిమ్మాపూర్, మల్లూరు గ్రామ ప్రజలకు మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా ఉన్నత అధికారుల సూచనలు మేరకు తగు సూచనలు చేసారు.ప్రజలను అడవిలోకి వెళ్ళవద్దంటు ఆటో లో ప్రచారం చేస్తూ తగు సూచనలు చేసారు.
ప్రజలుఅడవిలోకి వెళ్ళవద్దు,
పశువుల మేకల కాపర్లు ఎక్కువగా అడవి లోపలికి వెళ్ళవద్దు,
వ్యవసాయభూముల చుట్టూ కరెంటు తీగలు పెట్టవద్దు.
ఎవరికైనా పులి ఎదురు పడితే పులి కళ్ళల్లోకి చూడవద్దు, వెనుకకు తిరిగి పారిపోవద్దు, ధైర్యంగా వెనక్కి వెనక్కి నడవాలి, పెద్ద పెద్ద శబ్దాలు చేయాలి ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలి అని ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసారు.
Post A Comment: