CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష ఫలితమే నల్ల చట్టాల రద్దు --:విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

కేంద్రంలోని బిజేపి ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించ‌డంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు  స్పందించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

   రైతుల సంక్షేమాన్ని మ‌రిచి, కార్పోరేట్ సంస్థ‌ల‌కు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అలుపెరుగ‌ని పోరాటాలు చేసిన రైతుల‌కు అండ‌గా సీఎం కేసిఆర్  నిలిచార‌ని గుర్తుచేశారు.

  పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాల‌కు రేగా కాంతారావు  , సానుభూతిని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండ‌గా ముఖ్య‌మంత్రి కేసిఆర్  నిలిచార‌ని అన్నారు.

 కేంద్రం తీసుకొచ్చిన న‌ల్ల చ‌ట్టాల‌ను మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న‌ సీఎం కేసిఆర్ గారి ఆదేశాల‌తో పార్ల‌మెంట్‌లో న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్పీలు బైకాట్ చేశార‌ని అన్నారు.

నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా సీఎం కేసిఆర్  రైతుల ప‌క్షాన నిల‌బ‌డేందుకు దేశ‌వ్యాప్తంగా రైతుల‌ను ఏకం చేసేందుకు శ్రీ‌కారం చుట్టి ధ‌ర్నాలు చేప‌ట్ట‌డంతో కేంద్రంలోని బిజేపి ప్ర‌భుత్వం దిగివ‌చ్చింద‌న్నారు.

 రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నార‌ని అన్నారు.

 రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించి రైతుల‌కు అండ‌గా ఉన్నార‌ని అన్నారు.

నూత‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌పై ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేయ‌డానికి మ‌న సీఎం కెసిఆర్ గారు  కేంద్రం నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి రైతాంగానికి అండ‌గా నిలిచారని అన్నారు.

అదే స్పూర్తితో తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం. వ్య‌వ‌సాయం ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న క‌లిగిన నాయ‌కుడు మ‌న‌కు ముఖ్యమంత్రిగా ఉండ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల అదృష్టమ‌ని అన్నారు.ఇప్ప‌టికైనా బిజేపి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బుద్ది తెచ్చుకోని రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను వ‌దిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటంలో క‌లిసి రావాల‌ని సూచించారు.

తీర్మానాలపై సమాధానం ఏది...?

అనేక సమస్యలను కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు... దళితుల వర్గీకరణ కోసం శాసనసభ తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటివరకు దానిమీద కుయ్య లేదు కుటుకు లేదన్నారు... బీసీలు దేశంలో 50 శాతం ఉన్నారని కులగణన చేస్తే వారికి న్యాయం జరుగుతుందని, జన గణన లో కుల గణన చెయoడని అసెంబ్లీ తీర్మానం చేస్తే దానికి సమాధానం రాలేదన్నారు.

Share it:

TS

Post A Comment: