మన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్09):
ఇప్పటికే రైతులు పంటలు కోసి కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించక రైతులు అవస్థలు పడుతున్నారని,సిపియం మండలకార్యదర్శి ముదిగొండ రాంబాబు అన్నారు.మండలకేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండి దాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఓ వైపు వాతావరణం సహకరించక ఎప్పుడు వర్షం వచ్చి పండినపంట పాడైపోతదేమోనని రైతులు భయాందోలన లో ఉన్నారని పెట్టుబడి అంతకంతకూ పెరిగిపోయిన తరుణంలో గిట్టుబాటు దర క్వింటాకు2500రూపాయలు ప్రకటించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను,పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ దరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిమ్మల మదు,శ్రీరాములు,లక్మినర్సయ్య,అమల,వెంకటేశ్వర్లు,నాగరాజు,కోసయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: