మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన కె.సింధుజ కు మంజూరు ఐన రూ.16 వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమమే ద్యేయం గా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలకు,సీఎం సహాయక నిధి ద్వారా సహాయాన్ని అందజేస్తున్నారు అని,ఆపదలో ఉన్న పేద ప్రజలకు,ఇది ఎంతగానో,ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మైనారిటీ సెల్ అధ్యక్షులు హాబీబ్,నాయకులు వట్టం.రాంబాబు,మేకల రవి, ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: