మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం, పట్టణ పరిధిలోని అన్నారం గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే,పక్కా సమాచారం మేరకు తెల్లవారుజామున విఆర్వో లు భాస్కర్,చెంచయ్య లు
దాడులు నిర్వహించి 5 ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇసుక అర్ధరాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం ఉందని ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని,అక్రమదారులపై రూ.10వేల పెనాల్టీ, వేయనున్నట్లు తెలిపారు.
Post A Comment: