CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పీవీ కాలనీలో మైకుల హోరు నివారించాలి సింగరేణి కార్మికుల విజ్ఞప్తి.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని పివి కాలనీ లో ఇటీవల మైకుల హోరు బాగా పెరిగిపోయిందని,దీంతో రాత్రి బదిలీల లో పనిచేసే కార్మికులు ప్రత్యేకించి, ఆపరేటర్లకు నిద్ర భంగం వాటిల్లుతోందని,ధ్వని కాలుష్య నివారణకు పోలీసులు, సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.ఆదివారం వారు మాట్లాడుతూ,ఆలయాలు మందిరాల మైక్ సౌండ్ లు తగ్గించుకోవాలని కోరారు. అలాగే ఆకు కూరలు అమ్ముకునే,వాళ్ళ దగ్గర నుండి ఇనుప సామాన్లు కొనేవారు, ఉల్లిపాయలు,కోడిగుడ్లు,పాత పేపర్లు కొనేవాళ్ళు,ఫంక్షన్లకు అర్ధరాత్రులు డిజె సౌండ్ లు, ఇలా ధ్వని కాలుష్యంతో నిద్రా భంగం కలుగుతోందని తెలిపారు.కార్మికులకు పగలు సరైన నిద్ర లేకపోతే,రాత్రి బదిలీల్లో  ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని, వారు అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు నివసించే కాలనీ లలో ధ్వని కాలుష్యం ఎంత తక్కువగా ఉంటే,అంత మంచిదని,పిల్లల చదువులకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని,పేషెంట్లకు కూడా ఇబ్బంది కరం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఆపరేటర్లు ఎస్డీ.నాసర్ పాషా, మల్లికార్జున్,నయిమత్ అలీ, వెంకట్రావు,జగదీష్,కె.ప్రసాద్, రవి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: