CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని 5వ, వార్డుకు చెందిన ఆస్మా సుల్తానా (భర్త) ఖైసర్ పాష అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని వాటికి సంబంధించిన బిల్లులను తెరాస మండల పార్టీ ద్వారా ములుగు నియోజక వర్గ ఇన్చార్జి మరియు ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదేశం మేరకు  ఎండి ఆస్మా సుల్తానా ఇంటి వద్దకువెళ్ళి టిఆర్ఎస్ పార్టీ ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇంటికి వెళ్లి 28500/విలువగల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో కుల- మతాలకు మరియు పార్టీలకు అతీతంగా పేద- అట్టడుగు వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగ కరంగా ఉంది అని ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన రాష్ట్ర ప్రజలందరూ సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో- ఆప్షన్ సభ్యురాలు యండి వలియాబీ-సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ-నాగరాజు,పిఎసిఎస్ చైర్మన్ కూనురు అశోక్ గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, పోగుల లక్ష్మీనారాయణ, ఏటూరునాగారం పట్టణ అధ్యక్షుడు ఎం.డి ఖాజా పాషా,మండల బీసీ సెల్ అధ్యక్షుడు బట్టు రమేష్, మైనార్టీ అధ్యక్షుడు ఎండి ఆరీఫ్,ఎండి అజ్మత్ ఖాన్, ఎండి అక్బర్ పాషా,వార్డు సభ్యుల కే.కే రంజిత్, నాగసాగర్,కాత యాదగిరి, కొండాయి చిన్ని,తాళ్ల పెళ్లి మోహన్,పాలకుర్తి విజయ్, కంది కట్ల శ్రీనివాస్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: