గుండాల నవంబర్ 9 (మన్యం మనుగడ) మండలం పరిధి లోని సాయన్న పల్లి గ్రామంలో పోడు భూముల పట్టాల కోసం అధికారులు గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ గ్రామ సభకు ఇల్లందు ఎఫ్ డి ఓ నీరజ్ హాజరై పోడు రైతులకు పట్టాల కోసం పూర్తి అవగా హన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వబడతాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీడీవో వలి , రేంజర్ మురళి , సర్పంచ్ లక్ష్మీ నర్సు , పంచాయతీ సెక్రటరీ కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు
Post A Comment: