మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి, వేదాంతపురం, కేసప్పగూడెం గ్రామ పంచాయతీలలో నిర్వహించిన 2021 నవంబర్ 8, 9,10 తేదీలలో పొడు పట్టాల ధరఖాస్తు చేయుట కొరకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరిజనుల కొరకు నిర్వహిస్తున్న ఈ పోడు భూముల శాశ్వత పరిష్కారం కొరకు ఈ యొక్క దరఖాస్తులను స్వీకరిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2005 సంవత్సరం లోపు పోడు చేసిన ప్రతి ఒక్క గిరిజనులకు అర్హుల గల ప్రతి ఒక్కరికీ ఈ పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీని కొరకు మండల కమిటి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారని కావున పోడు భూములపై మీకు ఏ విధమైన సమస్య వున్న ఈ కమిటీలలో వున్న వారినే సంప్రదించాలని మధ్యవర్తులను, దళారులను నమ్మవద్ధని నమ్మి ఎవరు కూడా మోసపోయి డబ్బులు ఇవ్వొద్దని ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, పోడు కమిటి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: