మన్యం టీవీ ఏటూరు నాగారం
కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విదానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా కోసం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ములుగు జిల్లా జడ్పీచైర్మెన్ కుసుమ జగదీష్ ధర్నా ప్రాంగణంని గులాబీ శ్రేణులతో కలిసి పరిశీలించి గులాబీ శ్రేణులకు తగు సూచనలు ఇచ్చారు.కేద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నియోజకవర్గంలోని జడ్పీటీసీలు,ఎంపీపీలు, ఎంపీటీసీలు,సర్పంచులు,ఉప సర్పంచులు,రైతు కోఆర్డినేటర్లు, నాయకులు కార్యకర్తలు రైతులందురు స్వచ్చందంగా ధర్నాలో పాల్గొని విజయంతం చేయాలనీ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా ఇంచార్జ్ కుసుమ జగదీష్ చూచించారు.ఈ కార్యక్రమం లో ములుగు పట్టణ అధ్యక్షుడు చిన్న విజయ్,సీనియర్ నాయకులు గోవిద్ నాయక్, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, జాటోత్ బాలు,ములుగు యూత్ మండల అధ్యక్షులు బైకని సాగర్,వేల్పూరి సత్యం, ముడతనపల్లి మోహన్, రేణుకుంట్ల సురేష్,యూత్ జిల్లా నాయకులు తరుణ్ రెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: