మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో పాలకవర్గం పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిసి రోడ్లు వచ్చే విధంగా ఇరవై ఒక్క రోడ్లకు తీర్మానం చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్టం రమ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సమస్యలు పాలకవర్గం దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ సమస్యలు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పిటిసి వరలక్ష్మి, సర్పంచ్ రమ్య, ఉప సర్పంచ్ కేదార్ నాథ్, యువ నాయకులు జూపల్లి ప్రమోద్, వార్డు సభ్యులు యుఎస్ ప్రకాష్, సెక్రెటరీ హరికృష్ణ, టిఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ సోమని శ్రీను, అశ్వరావుపేట టౌన్ ప్రెసిడెంట్ సత్య వరపు సంపూర్ణ, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: