మన్యంటీవి, దమ్మపేట: ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు వారి సహకారంతో దమ్మపేట పట్టణంలో గురువారం ఆర్ధిక అక్షరాస్యత (CFL) కౌన్సిలర్ల అద్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన దమ్మపేట ఎపిజివిబి బ్యాంక్ మేనేజర్ కె రామకృష్ణ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా ఆయా మండలాల్లోని గ్రామీణ ప్రజలకు ఆర్థిక విషయాలు, బ్యాంకు వ్యవహారాల నిర్వహణ పద్ధతులు, బ్యాంకుల ద్వారా ప్రజలకు అందించే వివిధ సౌకర్యాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్న సామాజిక భద్రత, సంక్షేమ పథకాల గురించి సీఎ్ఫఎల్ కౌన్సిలర్ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని దమ్మపేట, అశ్వరావుపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల ప్రజలు బ్యాంకింగ్ కు సంబంధించిన సేవల సూచనలు నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కోఆర్డినేటర్ వి అంజి బాబు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: