CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమరవీరుల బాటలొ పయనిద్దాం

Share it:



మన్యం టీవి :

టేకులపల్లి మండలం లోని రామచంద్ర పేట గ్రామపంచాయతీ _

_పాతర్ల గడ్డ గ్రామంలో అమరవీరులను స్మరిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శి మూతి బుచ్చి రాములు జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ టేకులపల్లి మండల నాయకులు మేకల వినోద్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు వారు చదువుకున్న చదువు వదిలిపెట్టి ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలను వదిలి పెట్టి పేదల కోసం పేదల సమస్యల పరిష్కారం కోసం దున్నేవాడిదే భూమి కావాలని ఈ ప్రాంతంలో పోడు భూములు కొట్టించి ప్రజలకు పంచి పెట్టారు ఫారెస్ట్ దౌర్జన్యాలను ఎదిరించి ఈ ప్రాంత ప్రజలకు తోడుగా అండగా ధైర్యం ఇస్తూ ఉన్నారని అన్ని గ్రామాలకు విద్య వైద్యం రోడ్డు కావాలని పోరాటాలు చేసే సందర్భంలో పోలీసులు ఎన్ కౌంటర్లలో మాఫియా ముఠా చేతులలో అనారోగ్యంతో చనిపోయిన అమరవీరులకు పేరుపేరునా విప్లవ లాల్ సలాం తెలిపారు ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ మండల కార్యదర్శి పూనెం. సమ్మన్న మేకల రాంబాబు సూరే రమేష్ గ్రామస్తులు పాలొగొన్నారు 

Share it:

TELANGANA

Post A Comment: