మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదంతఃపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ రుద్ర సహిత సహస్ర చండియాగములో అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ, అశ్వారావుపేట ఎంపీటీసీ వేముల భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగించి పాడిపంటలు, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట అసుపాక ఎంపీటీసీ వగ్గెల అనసూర్య ఉన్నారు.
Post A Comment: