గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్ 14 (మన్యం మనుగడ) నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి అని ఆళ్ల పల్లి జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని నిరుపేదలు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. మర్కోడు గ్రామానికి చెందిన రావుల విజయకు 34వేలు ,రాఘవాపురం గ్రామానికి చెందిన రామారావుకు ఇరవై ఒక్క వెయ్యి , పాతూరు గ్రామానికి చెందిన కాంతయ్య కు 60 వేల రూపాయలు మంజూరయ్యాయన్నారు. చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమరం శంకర్ బాబు, కొమరం నరసింహారావు, ప్రేమ కళ , పార్టీ మండల మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, మండల నాయకులు బుర్ర వెంకన్న, కల్తీ నగేష్ , పి బబ్బులు, యువజన నాయకులుసతీష్ , నాయకులు తాళ్లపల్లి గణేష్ , తాళ్లపల్లి రవి, పొదిలి రాము, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: