సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించడం, ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పడం రైతాంగ పోరాట విజయమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా భీష్మించుకుని కూర్చున్నా ,రైతులు దీక్షతో, పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగించడం వల్లనే కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా దిగిరాక తప్పలేదు అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని నివారించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయంతో దేశ ప్రజలందరూ ముఖ్యంగా కార్మిక వర్గం కార్మిక వ్యతిరేక లేబర్ కోడు లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వందల మంది రైతాంగం మరణించినా, లక్షల మంది రైతాంగం ఉద్యమంలో పాల్గొని ఈ విజయాన్ని సాధించారని, ఇది చారిత్రాత్మక విజయమని అన్నారు. రైతాంగానికి జేజేలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు ఎండీ. గౌస్, జె. అశోక్, వి. జానయ్య, వెంకట్, చారి, సంజీవరెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఎం. రాజేందర్, రామకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: