బిర్సాముండా జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం. శ్రీనివాస్
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట గ్రామంలో పినపాక మండల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము ఐక్య వేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసి జాతి తరఫున పోరాడిన మొదటి యోధుడు బిర్సా ముండా అని, ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జన జాతీయ గౌరవ దివస్"గా ప్రకటించిందని, ఇది ఆదివాసీ బిడ్డ కు దక్కిన అరుదైన గౌరవం అని తెలియజేశారు.ఆదివాసీల అస్తిత్వం కొరకు బిర్సాముండా పోరాటం కొనసాగిందని, నేటి ఆదివాసి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, జానంపేట ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, పినపాక మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి నరసింహారావు, ఆదివాసి ఐక్య వేదిక కార్యదర్శి గొగ్గల కృష్ణ ,కొమరం శేఖర్, గోవిందు నాగేష్, కొమరం రాంబాబు, తాటి వెంకన్న, దనసరి నరసింహమూర్తి, పోలెబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: