మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్,గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారిని మణుగూరు పట్టణ ప్రముఖ కాంట్రాక్టర్ పీవీ.చారి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మధుసూదనాచారి నివాసంలో ఆయనను శుక్రవారం కలిసిన పీవీ.చారి పుష్పగుచ్ఛాలు అందజేసి,శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు.ఎమ్మెల్సీగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడతానని తెలిపిన ఆయన,అందరినీ కలుపుకొని, అందరి అభ్యున్నతి కోసం, విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Post A Comment: