మన్యం టీవీ మంగపేట.
మండలoలోని రాజపేట కేంద్రంగా గ్రామంలో ఎస్.బి. ఐ బ్యాంకు శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు మడే రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండలంలోని రాజుపేట గ్రామంలో ప్రజా సంఘాల సమావేశం కేశవ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన మండే రవి మాట్లాడుతూమండలంలోని కమలాపురంలో ఎస్.బి. ఐ బ్యాంకు ఉండడంతో మండల ప్రజలు కమలాపూర్ పోయి రావాలంటే అనేక ఇబ్బందులుపడుతూ ఒక రోజు పని కోల్పోతున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు వాహనాలలో అధిక ఛార్జీలు పెట్టి మధ్య తరగతి ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని అన్నారు. రాజపేట కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు,రమణక్కపేట,కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, దోమెడ, నిమ్మగూడెం,రామచంద్రుని పేట,వాడగూడెం, పంచాయతీ పరిధిలోని 20 గ్రామాలకు పైగా ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని తక్షణమే ప్రజల సౌకర్యం రాజుపేటలో ఎస్.బి.ఐ బ్యాంకు ఏర్పాటు చేయాలని మడే రవి కోరారు. ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు తోకల రవి మాట్లాడుతూ రాజపేట కేంద్రంగా ఎస్.బి.ఐ ఏర్పాటు కోసందశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజబాబు,ఎర్రయ్య,నవదీప్, వీరాజ్,చందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: