మాన్యం మనుగడ ప్రతినిధి: ములకలపల్లి:(నవంబర్23): వరి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపియం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని జరిగిన మండల కమిటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ,అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు 2500 రూపాయిలు మద్దతు ధర తక్షణమే ఇవ్వాలని,తేమ పేరుతో రైతుల నుండి తారం వసూళ్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ప్రభుత్వం రైతులకు టార్పలిన్ పట్టాలు ఉచితంగా ఇవ్వాలని,రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని,ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,వారి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వడ్డీ పేరుతో రైతులను మోసం చేస్తున్న దళారుల పై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వం రభీ లో వరి పంట వేయవద్దని రైతులను హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని,రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని,ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,గోగ్గల ఆదినారాయణ, వూకంటి రవికుమార్,నిమ్మల మధు, సోయం వీరస్వామి,గౌరి నాగేశ్వరరావు,కుంజా రాంముర్తి, గోపగాని లక్ష్మీ నర్సు,వర్షా శ్రీరాములు, మంచాల సారయ్య,ముదిగొండ రాంబాబు,తదితరులుపాల్గొన్నారు.
Post A Comment: