CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పిఎంఈజిపి కి అర్హత పొందిన లబ్ధిదారులకు అవగాహన.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో 3 నెలల క్రితం మహిళా సంఘాలకు మరియు నిరుద్యోగ యువతీ యువకులకు పిఎంఈజిపి స్కీం కు సంబంధించిన ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హత సాధించిన 52 మంది లబ్ధిదారులకు శుక్రవారం డిపి ఎం సతీష్ మరియు ఏటూరు నాగారం ఐ టి డి ఎ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.లబ్ధిదారులకు 12 రకాల యూనిట్లలో టైలరింగ్, జిరాక్స్,పేపర్ ప్లేట్స్,టెంట్ హౌస్,ఫ్లోర్ మిల్,వాటర్ ప్లాంట్,ప్రింటింగ్ ప్రెస్, సెంట్రింగ్ యూనిట్,కొటాల్,ఆయిల్ మిల్లు,మీ సేవా కేంద్రం,ఐస్క్రీం ప్లాంట్ కు సంబంధించిన యూనిట్ల పై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లబ్ధిదారులకు సంబంధించిన ఆరు రకాల అర్హత సర్టిఫికెట్లు దరఖాస్తు ఫారం తో పాటు ఆన్లైన్లో నమోదు చేసేందుకు దరఖాస్తు దార్ల నుండి దరఖాస్తులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం లక్ష్మీ దుర్గ,సీసీలు నరసయ్య, సమ్మయ్య,వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి,అకౌంటెంట్ విజయ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: