- రైతుల భూముల్లో అనుమతి ఇసుక తోడేదీ నది మధ్యలో
- నిబంధనలను నీళ్లలో తొక్కి నిలువెత్తు ఇసుకను తోడేస్తున్నారు
- ఆళ్ల పల్లి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ర్యాంప్
గుండాల /ఆళ్లపల్లి నవంబర్ 18 (మన్యం మనుగడ) అనుమతులు ఒకచోట ఇసుక తోడేదీ మరోచోట, రైతుల భూముల పేరిట అనుమతి తెచ్చి నది మధ్యలో తోడేస్తున్నారు. నిబంధనలను నీళ్లలో తొక్కి నిలువెత్తు ఇస్తాను తోడుకొని అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఒక చలానా తో రెండు కు పైగా ఉచిత తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు నిర్వాహకులు. ఆళ్లపల్లి మండలం లో నడుస్తున్న ఇసుక ర్యాంపు వద్ద నిబంధనలు ఏమాత్రం కనబడటం లేదు నది చట్టానికి విరుద్ధంగా జెసిబి లతో నది మధ్యలో ఉన్న ఇసుకను మూడు నాలుగు మీటర్ల లోతు తీసేసి ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఒకే చలానా కట్టి అదే లారీ 2 కు పైగా ఇసుకను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆళ్లపల్లి మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాలతో మరో కథనం రానుంది
Post A Comment: