CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సెంట్ ఆంటోనీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎంఈఓ వెంకట్..

Share it:

 


మన్యం టీవీ :  జూలూరుపాడు, నవంబర్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని సెంట్ ఆంటోనీ పాఠశాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి గూగులోత్. వెంకట్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పదో తరగతి విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న  ఆరోపణల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అధిక ఫీజులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

అదేవిధంగా పాఠశాలలో  ఉపాధ్యాయులు ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారని, వారంతా అర్హులా..! కాదా అని విచారించి అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయానికి తరలించారు.

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేసినా, అర్హులు కాని వారిచే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పాఠశాల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు.

Share it:

TS

Post A Comment: