చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :తెరాస రాష్ట్ర నాయకులు తుమ్మల పుట్టినరోజు వేడుకలు మండల వ్యాప్తంగా కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం తెరాస మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు కేక్ ను కత్తిరించి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల చేసిన అభివృద్ధి నేటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందాన్నారు. కార్యకర్తలకు అండగా తుమ్మల మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నాయకులు దేవుడిని పార్ధించారు. ఈ కార్యక్రమం లో తెరాస మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వర్లు, ప్రధానకరదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఉపాధ్యక్షులు మద్దిరాల పిచ్చయ్య, సర్పంచ్ మలిపెద్ది లక్ష్మీ భవని, జిల్లాపరిషత్ కోప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, తెరాస సీనియర్ నాయకులు జడ వెంకయ్య, వంకాయలపాటి బాబురావు, గాదె శివప్రసాద్,చిదేళ్ళ పవన్ కుమార్, సూరా వెంకటేశ్వర్లు, కళ్లెం వెంకటేశ్వర్లు, బానోతు బీలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: