మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట మట రఘు ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.1917 నవంబర్ 19 న జన్మించిన ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారని అన్నారు.పేద ప్రజల కోసం హరిజన గిరిజనులకు కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి వారి జీవన ప్రమాణాలను పెంచిందని వాళ్లను ఆర్థికంగా అభివృద్ధి చేసిందని అన్నారు.
దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచి శాంతి భద్రతల పరిరక్షణలో మెలకువతో పరిపాలించారని అన్నారు అదేవిధంగా విదేశాలతో మిత్ర వ్యవహార శైలిలో కూడా తనవంతు పాత్ర పోషించి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.ఇందిరాగాంధీ దేశ మొట్ట మొదట మహిళ ప్రధాన మంత్రిగా ఆయన అప్పుడు దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని ఆ పరిస్థితిని అంతటిని సద్దుమనిపించి,తన చాకచక్యం చూపించిందని అన్నారు.విద్య ఆరోగ్య రంగాలలో కూడా ప్రగతి సాధించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,వావిలాల నర్సింగరావు, ఏటూరునాగారం టౌన్ అధ్యక్షుడు తాళ్ల పెళ్లి నరేందర్, సప్పిడి రాము,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు వావిలాల సాంబశివరావు,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల యూత్ నాయకులు చామర్తి మనోజ్ ,
సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకట స్వామి,ఆలంనాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: