మన్యం టీవి ,వెబ్ డెస్క్:
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ చిరు వ్యాపారం ప్రారంభం.
జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి ఎదగడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో జే.డీ ఫౌండేషన్ వారు "ఉపాధి భరోసా" పేరుతో జీవనోపాధి కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా భద్రాచలం పట్టణం శివారు పురుషోత్తపట్నం చెందిన రోజువారి కూలి చేసుకునే నిరుపేద షేక్ బాజీ గత సంవత్సరం క్రితం ప్రమాదము లో మెదడు కి దెబ్బ తగిలి అనారోగ్యంతో బాధ పడుతు వైద్య ఖర్చులకు మందులకి కూడా ఇబ్బందులు ఎదురవ్వడము తో కుటుంబ పోషణకు అతని భార్య తనకు జీవనోపాధి కల్పించాల్సిందిగా జెడి పౌండేషన్ కోరడం జరిగింది. పూర్తిగా వివరాలు పరిశీలించిన మీదట రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ చేతుల మీదుగా ఆమెకు తెలిసిన కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ బాధ్యులు కె. మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వేమూరి శ్రీనివాస్, శ్రీ జమీల్, శ్రీ అమీద్ వారి ఆర్థిక సహాయంతో ఈ వ్యాపారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పరిస్థితి తెలుసుకుని తమకు అండగా నిలిచిన జే.డీ పౌండేషన్ కి రుణపడి ఉంటామని షేక్ బాజీ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీ వేమూరి శ్రీనివాస్, శ్రీమతి హన్సి పవన్, యూసఫ్ మియా, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి,కడాలి నాగరాజు, శ్రీ పిట్టా పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: