చండ్రుగొండ మన్యంటీవీ ప్రతినిధి :సైబర్ నేరల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ రాజేష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సైబర్ అంబాసిడర్ సమావేశంలో ఆయన పాల్గొని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లో మంచికి మాత్రమే ఉపయోగించాలని, ఇతర పనులకు ఉపయోగిస్తే చట్టపరంగా నేరస్థులవుతాన్నారు.మంచిని మాత్రమే స్వికరించాలన్నారు. చెడుమార్గంలో ప్రయాణిస్తే ఎప్పటికైనా నేరస్తులుగా మారాతన్నారు. మన సెల్ నుండి మన వ్యక్తిగత విషయాలను, డాక్యుమెంట్లను, ఓటీపీ నెంబర్లను, ఇతర వ్యక్తులకు అసలు పంపవద్దున్నారు. చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. సైన్స్, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశ నుండి మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం మంజుశ్రీ, ట్రైని ఎస్ ఐ స్వప్న కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: