మన్యం టీవీ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన బానోతు అజయ్ అనే యువ క్రీడాకారుడు స్వయం కృషి తో షార్ట్ఫుట్ గేమ్ లో నేషనల్ లెవల్లో గతంలో మంచి ప్రతిభను కనబరిచాడు.ది 25-11-2021 నుండి ది 29-11-2021వరకు గోవా లో నిర్వహిస్తున్న షార్ట్ ఫుట్ జాతీయ స్థాయి లో పాల్గొనటానికి ఆర్థిక స్తోమత లేని కారణం వలన పాల్గొని లేక పోతున్నాను అని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగానికి తెలియజేయడం జరిగింది. సహృదయంతో స్పందించిన జనసేన పార్టీ తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్ ఆదేశాలనుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు డేగల రామచంద్ర రావు సమక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కమిటీ ఆధ్వర్యంలో బానోత్ అజయ్ గారి ప్రయాణ ఖర్చులు గాను 15 వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షులు డేగల రామచంద్ర రావు మరియు ప్రధాన కార్యదర్శి మెడ బోయిన కార్తీక్, యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ యాసంనేని అజయ్ కృష్ణ ,మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కమిటీ సభ్యులు, జనసేన కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: