మన్యం టీవీ : భద్రాచలం నవంబర్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ లోని స్టాఫ్ నర్స్ ( ఏఎన్ఎం) ఉద్యోగాలను జీవో ఎంఎస్ నెంబర్ 68 కి విరుద్ధంగా భర్తీ చేయడానికి జారీచేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయ్యాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ & హెల్త్ ఆదివాసి ట్రైబుల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గిరిజన ఉద్యోగులంతా సోమవారం భద్రాచలం పట్టణంలోని అభ్యుదయ భవనం నుండి ర్యాలీగా ఐ టి డి ఎ వద్దకు చేరుకొని ప్రాజెక్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ 68 కి విరుద్ధంగా జిల్లా కలెక్టర్ ను పక్కదారి పట్టిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ మరియు ఏవో పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కి ఫిర్యాదు చేశారు. వెంటనే జనరల్ నియామక ప్రకటన ను రద్దు చేయకపోతే దీపావళి పండుగ తరువాత ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలను నిరవధికంగా బందు చేసి సమ్మె చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబుల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు కారం వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గొంది వెంకటేశ్వర్లు, పాలెబోయిన కృష్ణయ్య, వీసాల కృష్ణయ్య, ఉమాదేవి, ఏటి ఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు, ఏ ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్, పొలిటికల్ జేఏసీ నాయకులు వాసం రామకృష్ణ, సోయం కన్నారావు, పర్సా సుశీల, కుంజా సరస్వతి, శ్యామలత, చిట్టెమ్మ, జవ్వాడి సుధాకర్, తాటి బాబురావు, సున్నం కృష్ణ, కొండ్రు నరసింహారావు, షారారాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: