CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇసుక ర్యాంపు లో జీరో దందా.డిడి కట్టేవి తక్కువ దొడ్డిదారిన పోయేది ఎక్కువ.ఇంత జరుగుతున్న అధికారులు మౌనం వీడలే.విచారణ చేపడితే వెలుగులోకి.మరిన్ని అక్రమాలు

Share it:

 

 



  

 గుండాల /ఆళ్ల పల్లి నవంబర్ 23 (మన్యం మనుగడ)  ఆళ్ల పల్లి ఇసుక ర్యాంపు లో అంత జీరో దందా నే డిడీ  కట్టేది తక్కువ  దొడ్డిదారిన పోయేది ఎక్కువ. ఇసుక ర్యాంపు లో ఇంత జరుగుతున్న మౌనం వీడని అధికారులు. ఇసుక ర్యాంపు పై విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని  మండల వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లపల్లి మండలం లో జరుగుతున్న ఇసుక  ర్యాంపు లో అక్రమాలు రోజు రోజు కొత్తవి వెలుగులోకి వస్తున్నాయి వందల కొద్ది లారీల్లో విస్తుపోయిన ప్రభుత్వానికి మాత్రం పదుల సంఖ్యలోనే డీడీల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది.  రాష్ట్ర అవసరాలకు తోడ్పాటు గా ఉంటుందని ఇసుక ర్యాంపు లకు అనుమతిస్తే దానిని కొందరు దళారులు  దొడ్డిదారిన ఇసుక అక్రమంగా తరలించి  ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపడితే తప్ప జీరో దందాపై నిజాలు బయటికి వచ్చే పరిస్థితులు కనబడుటలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అక్రమ ఇసుక ర్యాంపు పై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు


Share it:

TS

Post A Comment: