గుండాల/ ఆళ్ల పల్లి నవంబర్ 1 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని గుత్తి కోయ గ్రామాలను ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుమతి సోమవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బూసి రాయి, సింగారం, పెద్ద వెంకటాపురం గ్రామాల్లో ఒత్తి కోయల కు పోషకాహారంపై అవగాహన కల్పించామన్నారు. గ్రామాల్లోని పిల్ల బరువు, ఎత్తు, జబ్బా , చుట్టుకొలత లను తీసుకున్నామన్నారు. ఐ సి డి ఎస్ పోషకాహారం తీసుకునే వారి వివరాలను సేకరించి బరువు తక్కువగా ఉన్న వారికి అధికంగా పోషకాహారాలు అందిస్తాం ఆమె అన్నారు. గర్భిణీలు తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకో వారికి సూచించామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అంగన్వాడి టీచర్ రత్నమ్మ పాల్గొన్నారు
Post A Comment: