మన్యం మనుగడ వాజేడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ కేంద్రంగా వైట్ ఆర్మీ హెల్పింగ్ హాండ్స్ సంస్థను సర్పంచ్ కోర్స నర్సిహమూర్తి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ లేదా స్వయంసేవ అనేది సాధారణంగా ఒక పరోపకార కార్యకలాపంగా పరిగణించబడుతుంది, ఇక్కడ ఒక వ్యక్తి లేదా సమూహం మరొక వ్యక్తి, లేదా సమూహం లేదా సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి ఆర్థిక లేదా సామాజిక లాభం కోసం సేవలను అందిస్తుంది.స్వయంసేవకం నైపుణ్యం అభివృద్ధికి కూడా ప్రసిద్ది చెందింది, ఇది తరచుగా మంచితనాన్ని ప్రోత్సహించడానికి లేదా మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. స్వయంసేవకంగా పనిచేయడం వల్ల స్వచ్ఛంద సేవకులతో పాటు సేవ చేసిన వ్యక్తికి లేదా సమాజానికి సానుకూల ప్రయోజనాలు ఉండవచ్చుఅని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సంస్థను ప్రారంభించిన మొదటి రోజే 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితిలో ఉన్న శ్యామల శ్రీకాంత్ బొల్లారం గ్రామ వాస్తవ్యులు నిరుపేద కుటుంబానికి చెందిన వారికి వైట్ ఆర్మీ హెల్పింగ్ హాండ్స్ సంస్థ వారు. 5000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో, చేల రామారావు. చింత సర్వేశ్వరరావు .ఎంపీటీసీ కుర్సం సమ్మక్క .చింత సమ్మయ్య. వాసం నాగరాజుకు . కుచింటి చిరంజీవి . పాయం. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: