చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:పొడుదారులు నిర్ణీత సమయం లోపు పోడుభూముల హక్కు కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అన్నపూర్ణ సూచించారు. మంగళవారం రావికంపాడు గ్రామంలోజరిగిన పొడుహక్కుల రక్షణ కమిటీ పై అవగాహన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.... దరఖాస్తులో ఉన్న విషయాలను పూర్తిస్థాయిలో నింపి అధికారులకు తెలియజేయాలన్నారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూముల పై సర్వే చేసి, గ్రామ కమిటీ పర్యవేక్షణలో దరఖాస్తులను పరిశీలించటం జరుగుతుందన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను జిల్లా కమిటీలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు పొడుదారులకు అధికారులు అందజేశారు.రావికంపాడు ఫారెస్ట్ సెక్షన్ అధికారి రామారావుతో పోడుదారులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగటంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. అధికారులు, నాయకులు పోడుదారులను సముదాయించడం తో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సమావేశంలో డిప్యూటీ తాసిల్దారు స్వప్న, ఎం పి ఓ తులసి రామ్,ఫారెస్ట్ అధికారులు, నాయకులు భూపతి శ్రీనివాసరావు, భూపతి రమేష్,భానోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: