వార్త సేకరణ పారదర్శకంగా ఉండాలి
👉నూతన ప్రెస్ క్లబ్ భవనానికి శంకుస్థాపన చేసిన రేగా
➡️ ప్రజల సమస్యలను వెలికితీసే వారే జర్నలిస్టులు
➡️ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల నవంబర్ 8 (మన్యం మనుగడ) మండల కేంద్రంలో పాత్రికేయులు నూతనంగా నిర్మించబోతున్న ప్రెస్ క్లబ్ భవనానికి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలికి తీయడం లో ఎప్పుడు ముందు ఉంటారు అన్నారు. ప్రెస్ క్లబ్ భవనానికి శంకుస్థాపన నా చేతుల మీదుగా చేయడం ఆనందంగా ఉందని ఆయన ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యం, సర్పంచ్ సీతారాములు, తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీడీవో వలి, మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు, తుళ్లూరు బ్రహ్మయ్య , కోలేటి భవాని శంకర్, పగడాల సతీష్ రెడ్డి, గుండాల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు
Post A Comment: