CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కోల్ పెన్షనర్ ల సమస్య పై వినతిపత్రం : పెన్షనర్ ల సంఘం

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వేజ్ బోర్డ్ ప్రయోజనాలను పెన్షనర్ లకు వర్తింప చేయాలని,వన్ ర్యాంక్,వన్ పెన్షన్ విధానం అమలు చేయాలని, కనీస పెన్షన్ 15వేలు గా నిర్ణయించాలని తదితర సమస్యలపై 11వ నేషనల్  వేజ్ అగ్రిమెంట్ (ఎంన్  సి  డబ్ల్యూ ఎ)చర్చించాలని ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కు  అల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పెన్షనర్ ల సంఘం రాష్ట్ర నాయకులు కూకట్ల శంకర్ మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా డియర్ నెస్ రీలీఫ్ చెల్లించాలని,ఎగజేక్యూటివ్ లాగానే ఉచిత వైద్యం అందరికి కల్పించాలని,అన్నారు.అదేవిధంగా ఎగ్జికూటివ్ లకు ఇచ్చినట్లు గానే 2వ పెన్షన్ 2007 నుండి ఇవ్వాలని,పదవి విరమణ ప్రయోజనాలకు వేతనం 30%యాజమాన్యం చెల్లించాలని,గ్రాట్యుటీ 20 లక్షలు కార్మికులకు కూడాద               

ది.01-07-2017 నుండి అమలు చేయాలని,మెడికల్ స్కీం తో అధికారులకు,కార్మికులకు ఉన్న అన్ని అసమానతలు తొలిగించాలని,డెత్ రిలీఫ్ 30వేలు పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు చెల్లించాలని అన్నారు.ఈ డిమాండ్ల్ ను ఢిల్లీలో జరిగే జేబీసీసీఐ మీటింగ్ లో చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, ఆర్ బి జె రాజు,ధర్మరాజు,కొండబల రామచందర్,మూర్తి,ఎం వీరయ్య,పి రాజులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: