మన్యం టీవీ ఏటూరు నాగారం
జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని టేకులకుంట గుత్తి కోయ గూడెం లో లో బిర్సాముండా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.లెర్నింగ్ సెంటర్ ఉపాధ్యాయురాలు మౌనిక మాట్లాడుతూ.విద్యార్థులకు బిర్సాముండా ఆదివాసుల భూములను,అటవీ సంపదనను,ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను బ్రిటిష్ వారి నుండి కాపాడేందుకు ఆదివాసులను సంఘటితం చేసి ఉద్యమించిన భారతదేశ తొలి ఆదివాసి స్వాతంత్ర్య పోరాట యోధుడు అని అన్నారు.అనంతరం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో టేకులకుంట లెర్నింగ్ సెంటర్ విద్యార్థినీ విద్యార్థులు,గుత్తి కోయ కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: