- దేశం లోనే అరుదైన గౌరవం దక్కించుకున్న కన్నాయిగూడెం గ్రామపంచాయితి
మన్యం టీవీ కరకగూడెం:భారత దేశంలోని బెస్ట్ కోవిడ్ కంట్రోల్ గ్రామపంచాయతిగా తెలంగాణ రాష్ట్రములోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతి ఎంపిక చెయ్యడం జరిగింది. దేశంలోని మొత్తం ఆరు గ్రామపంచాయతి లను ఎంపిక చేయగా రాజస్థాన్ 1 అస్సాం 2 మణిపూర్ 1 ఉత్తరాఖండ్ 1 తెలంగాణ రాష్ట్రములోని కన్నాయిగూడెం గ్రామపంచాయతి ఎంపికచేశారు. ఈ విషయాన్ని నేరుగా సర్పంచ్ కు శారవాణి ద్వారా, మెయిల్ తెలియజేసిన ఎన్ఐఅర్పిఅర్ఎస్ ( నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతి రాజ్). ఎన్ఐఅర్ డి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నేల 23,24 తారీఖులలో హైదరాబాదులో జరగబోయే వ్యవస్థాపక ఉత్సవాలలో పురస్కారాలను అందించి ప్రసంగించే అవకాశం కన్నాయిగూడెం గ్రామపంచాయతి సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మీ కి కల్పించారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఎన్ఐఅర్ డి వారికి మరియు కోవిడ్ సమయంలో సహాయ సహకారాలు అందించిన ఆశా కార్యకర్తకు,సెక్రటరీ కి మండల ,జిల్లా అధికార గణానికి గ్రామప్రజలకు సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి మండల అధ్యక్షుల కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: