మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, యంత్ర రాజా సహిత కాళేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శివ కళ్యాణం ఘనంగా నిర్వహించారు, స్వామివారికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఆకాశ దీపాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకుని శ్రీవారి కైంకర్యంలో పాలుపంచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి విశేష పూలఅంకరణ చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: