మన్యం మనుగడ, పినపాక :
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని దుగినేపల్లి శేగర్శల గ్రామం లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ధాన్యాన్ని ఆరబోసిన రైతన్నకు ఒక్కసారిగా పడిన వర్షంతో దిక్కు తోచక, ధాన్యం పై పట్టాలు కప్పక ముందే ఒక్కసారిగా వర్షం కురిసింది. సుమారు 30 ఎకరాల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయి పోయింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, దుగినే పల్లి లోని తండాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Post A Comment: