మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు మాట్లాడుతూ జిల్లా అభివద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు అని, ఆయన జన్మదిన వేడుకలు జతిరుమలకుంటలో సంతోషంగా ఉందన్నారు. తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు ఆధ్వర్యంలో చేసిన వేడుకల్లో ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు, జుజ్జురి సత్యనారాయణ, జగన్నాధం, మండల తెరాస యూత్ లీడర్ నాగ కిషోర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు తరుణ్ తేజ, ముత్యాలరావు, కే.చెన్నరావు, లింగాల చక్రధర్, అల్లం చంద్రం, సురేష్, దానెయిలు, పుల్లారావు, ప్రదీప్ యువత తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: