మన్యం టివి దుమ్ముగూడెం:
రోటరీ జిల్లా 3150 గవర్నర్
కె ప్రభాకర్ తమ అధికారిక పర్యటనలో భాగంగా భద్రాచలం రోటరీ క్లబ్ ని సందర్శించారు
అందులో భాగంగా ఇప్పటివరకు రోటరీ క్లబ్ చేసిన కార్యక్రమంలో వివరాలు మరియు భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు.
దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు సోలార్ లాంప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డ్ పొందిన ఏ జె. ప్రభాకర్ ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గవర్నర్ కె ప్రభాకర్ కాబోయే గవర్నర్ బి శంకర్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ నాగేశ్వర రావు క్లబ్ అధ్యక్షులు కె మధుసూదన్ రావు కార్యదర్శి చలపతిరావు కోశాధికారి విద్యాసాగర్ పూర్వ అధ్యక్షులు భూషణ రావు,సుధాకర్ రెడ్డి,ఇతర సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: