చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: అయ్యప్ప భక్తుల కోసం టిఎస్ ఆర్టిసి సేవలు ప్రారంభించడం జరుగుతుందని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్టాండ్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... శబరిమలైకు అయ్యప్ప భక్తుల కోసం డీలక్స్, లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 7, 8, 10 రోజులు యాత్ర ఉంటుందని, దీనికి అతి తక్కువ ధరలకు మాత్రమే భక్తులను వివిధ రాష్ట్రాలను కలుపుతూ తీసుకుపోవడం జరుగుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం అద్దె ప్రతిపధికన బస్సులను పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ సి ఈ శ్యమెల్,ఎస్ డి ఐ ఎంసిహెచ్ రావు,సిబ్బంది బత్తుల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: