CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పోరాటాల ఫలితమే నల్ల చట్టాల రద్దు:జడ్పీటీసీ పొశం. నర్సింహారావు.రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు పట్ల టిఆర్ఎస్ శ్రేణుల హర్షం.

Share it:






మన్యం టీవీ మణుగూరు:


టిఆర్ఎస్ పార్టీ పోరాటాల పలితంగా నే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేయడం జరిగిందని మణుగూరు జడ్పీటిసి పొశం నరసింహారావు అన్నారు.శుక్రవారం సాయంత్రం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నల్ల చట్టాల రద్దు పట్ల ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ శ్రేణులు,నాయకులు హర్షం వ్యక్తం చేశారు.బాణాసంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దొడ్డిదారిలో దోచిపెట్టేయదుకు నల్ల చట్టాలను వెతిరేకిస్తూ, రైతులు చేస్తున్న పోరాటాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు అన్నారు.పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన గళం వినిపించారు అని గుర్తుచేశారు.దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అని,ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కే.వీ.రావు,పీఏసీఎస్ చైర్మన్,కుర్రి.నాగేశ్వరరావు, ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు, జవీద్ పాషా,మణుగూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా.అప్పరావు,కార్యదర్శులు బొలిశెట్టి.నవీన్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, మణుగూరు సమితి సింగారం పంచాయతీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, ముద్దంగుల కృష్ణ,మేకల రవి, ప్రభుదాస్,బాబుజాన్ మరియు మహిళ అధ్యక్షురాలు రమాదేవి,చంద్రకళ,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: