మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణ నేతకాని (మహర్) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దర్శనాలు భువనచంద్ర అధ్వర్యలో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నిర్వహించారు.ఈ సమావేశం లో ములుగు జిల్లా అధ్యక్షులు గా సునారికారి నర్సింహారావు ని,ప్రధాన కార్యదర్శి గా కొండగొర్ల సంజీవరావును, ఉపాధ్యక్షులుగా గోగు ఆనంద్ ను,సంయుక్త కార్యదర్శి గా జాడి చిన్న సమ్మయ్యను, కోశాధికారిగా కుమారి కొండ గోర్ల ఇందిరా ను నియమించినట్లు తెలంగాణ నేతకాని మహర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువన చంద్ర తెలిపారు.ఈ సంద్భంగా మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన నేతకాని జాతి అభివృద్ధి కొరకు,ఉద్యోగుల సంక్షేమం కొరకు,సమస్యల పరిష్కారం ఉద్యోగుల ఐక్యత కోసం పని చేయాలన్నారు.ఈ సంద్భంగా జిల్లా నూతన కమిటీ బాధ్యులు మాట్లాడుతూ,తమను తెలంగాణ నేతకాని మహర్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా నూతన బాధ్యులుగా నియమించి నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంకిత భావంతో పనిచేస్తూ,ఉద్యోగుల ఐక్యత కు మరియు అభివృద్ధి కొరకు పాటుపడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నేతకాని మహార్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి చంద్రయ్య,రాష్ట్ర కోశాధికారి డా.రమేష్ బెడ్డల,ఉద్యోగులు కావేరి కృష్ణ రావు,దుర్గం సూరయ్య,కుల పెద్దలు గోగు మల్లయ్య,చల్లురి ఎల్లయ్య స్థానిక ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: