మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులుగా కాట్రగడ్డ.సురేందర్ పటేల్ ను నియమిస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ పటేల్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి మణుగూరు సోషల్ మీడియా అధ్యక్షులు గా నియమించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను,సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తానని అని అన్నారు. మణుగూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారుచేయాడానికి కృషి చేస్తానని తెలిపారు.
Post A Comment: