మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి (నవంబర్-13):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామం కు చెందిన చిలుకూరి వెంకటేశ్వరరావు, కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం అందరికీ విధితమే. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం నాడు అబ్బుగూడెం గ్రామానికి విచ్చేసి చిలుకూరి వారి కుటుంబసభ్యులను పరామర్శించి, వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శ కార్యక్రమంలో తుమ్మల వెంట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు-బోయినపల్లి సుధాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు-కొత్తూరు వెంకటేశ్వరరావు, అబ్బుగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్-కర్రీ వెంకటేశ్వర్లు, నాయకులు- మరకాల లక్ష్మారెడ్డి, వడ్డెబోయిన చెన్నారావు, హుస్సేన్, వీరబోయిన వెంకటేశ్వర్లు,జంగాల ఉమా,చల్లా రాంబాబు, పోట్రు వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: